Category: Uncategorized
-

ఐ-ప్యాక్ ప్యాకప్..!! ఇక అంతా డొల్లనే..??
దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకొనే ఏ పార్టీ అయినా సరే ఆయన సాయం కోరే స్థాయికి ఆయన ఎదిగారు. ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) అనే సంస్థను స్థాపించి ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోనే ప్రముఖమైన స్థానంలో నిలిచారు. అయితే, అలాంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఐ ప్యాక్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక తనకు ఐ ప్యాక్ సంస్థకు ఎలాంటి…
-

చెల్లి షర్మిలపై జ`గన్` ఎక్కుపెట్టాడు
జగన్ ఎంత నటోరియస్సో చాలా సందర్భాల్లో జనానికి తెలిసొచ్చింది. తన అవినీతి, అధికార, అహంకారానికి ఏమాత్రం భంగం వాటిల్లినా సహించలేడు. ఇది నియంతలలో ఉండే సర్వసాధారణ లక్షణం. అవినాశ్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు, తనకైనా, సొంత చెల్లెలు షర్మిలకైనా ఇవ్వాలన్నాడని సొంత బాబాయ్ అని కూడా చూడకుండా వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా లేపేసిన చరిత్ర అబ్బాయిది. జగన్ చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో ఉంటే, పాదయాత్ర చేసి వైకాపాకి అండగా నిలిచి పార్టీని నిలబెట్టింది…
-

దెబ్బ మీద దెబ్బ.. కంటికి కునుకు లేదు..శాంతి లేదు
వైకాపా అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం రగిల్చిన చంద్రబాబుని అరెస్టు చేశాడు. అవినీతి ముద్రవేయాలనుకున్నాడు. ఆయన అభివృద్ధి బయటపడి, బాబొస్తేనే భవిష్యత్తు అని ప్రజలు మరింత బలంగా విశ్వసించేలా చేసింది జగన్ కుట్రలే టిడిపి-జనసేన పొత్తు కుదరకూడదని విశ్వప్రయత్నం చేశాడు. బాబుని జైలులో వేయించానని సంతోషపడ్డాడు. బాబు అక్రమ అరెస్టుతో టిడిపి-జనసేన పొత్తు పరోక్షంగా ఖరారు చేయించింది జగనే. యువగళం-నవశకం సభని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నాడు. అది జనప్రభంజనమై తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి నారా లోకేష్ ఢిల్లీ పారిపోయాడు…
-

జగన్ లాయరే రాం గోపాల్ వర్మ వ్యూహం లాయర్
అవును మీరు చూస్తున్నది నిజమే. జగన్ కి లాయర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి కూడా లాయర్. అయితే వ్యూహం సినిమాతో మాత్రం జగన్కి సంబంధం లేదు . వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్ జగన్ సర్కారు.. అతిథులు జగన్ మంత్రులు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్కి జగన్ టిటిడి పదవి కూడా ఇచ్చాడు జగన్ అక్రమాస్తుల కేసులు, బాబాయ్ మర్డర్ కేసుతో పాటు మొత్తం జగన్ అండ్…
-

సీఐడీ అడ్డదారికి హైకోర్టులో కిలారు రాజేశ్ అడ్డుకట్ట..!!
సెకెండ్ ఛాన్స్ రాదనే భయంతో టీడీపీని అణిచివేయడానికి అడ్డదారిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుకొని పార్టీలో ముఖ్యనేతలపై తప్పుడు కేసులు పెట్టి వారి గొంతు నొక్కాలని చూశారు వైసీపీ బాస్. ఆయన మెప్పు కోసం చంద్రబాబుపై పెట్టిన పసలేని కేసులు కోర్టులో నిలబడవని సీఐడీ అధికారులకు అర్ధం కావడానికి ఎంతోకాలం పట్టేలేదు. దీంతో టీడీపీ నేత కిలారు రాజేశ్ను బెదిరించి, బాబుపై తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారు.…
-
ఏపీ రాజకీయాల పై బాబుకి పీకే సంచలన నివేదిక
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్తో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లారు. లోకేష్ కారులోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ వెళ్లటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటన వార్తల్లో రావడంతోనే ఏపీలో వివిధ రాజకీయ నేతలు, విశ్లేషకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరఫున…
-
జగన్ ను మానసికంగా దెబ్బకొట్టడమే టిడిపి వ్యూహం !
ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి నాయకులని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని అక్రమ కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తూ టిడిపి నాయకుల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాడు జగన్. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాడనికి కేసుల్ని.. అరెస్టుల్ని జగన్ వాడుకున్నారు. కానీ ప్రతీకారం కోసం పెట్టె ఇలాంటి కేసులు అసలు వర్కవుట్ కావని, రాజకీయాల్లో వేధింపులు అంతిమంగా ఆ పార్టీ నేతకే లాభిస్తాయని…
-

బాబు, పీకే మీట్.. తాడేపల్లి ప్యాలెస్ షేక్..!!
ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల తిరుగుబాటుతో జగన్ కోటకు బీటలు పడుతున్నాయి. లేటెస్ట్గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే, వైసీపీ జెండా పీకేసి.. సైకిల్ ఎక్కడంతో తాడేపల్లి ప్యాలెస్లో మినీ భూకంపం వచ్చినంత పనైంది. జగన్ వ్యూహాలు, రహస్యాలు బాగా తెలిసిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యర్ధితో చేతులు కలపడం, వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారనే న్యూస్ రాగానే.. వైసీపీ నేతల్లో…
-

“తుమ్మ” ముళ్ళే కేసీఆర్ ని అధికారం పీఠానికి దూరం చేశాయా?
తెలంగాణాలో ఎన్నికల హడావిడి తగ్గి కొత్త ప్రభుత్వం మొదటి విడత ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించింది. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ గా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖలను స్వీకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను దాదాపు నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న తుమ్మల గారికి అధికార పార్టీలో ఉండి కూడా గత 5 సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. అధికార పెద్దలు నిర్లక్షం చేసినా ఆయన ఎప్పుడూ…
-

200 పైగా యూట్యూబ్ చానెల్స్ తో ఎన్నికల సమరంలోకి వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం దూసుకుపోతున్న పార్టీల నేతలు, తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను టిడిపి, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వాటిని తిప్పికొట్టే పనిలో అధికార వైసీపీ పార్టీ నేతలు ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాము అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను, ఆంధ్రప్రదేశ్…