Author: urban
-

-

-

జగన్ మేనిఫెస్టో సిద్ధం.. ఈసారి వరాలు ఇవే
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. అభ్యర్థుల ఎంపిక తో పాటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి డిసైడ్ అయ్యాయి. ఈ విషయంలో సీఎం జగన్ దూకుడుగా ఉన్నారు. సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది జనాలను తరలించి విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఈ సభలు పూర్తయ్యాయి. విశాఖ జిల్లా భీమిలి లో తొలి సభను నిర్వహించారు. తర్వాత దెందులూరు, రాప్తాడు లో సభలు గ్రాండ్ సక్సెస్…
-

రాష్ట్ర రాజకీయ చరిత్ర గతిని మార్చనున్న యువగళం-నవశకం
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు. విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. రాష్ట్ర…
-

జగన్ లాయరే రాం గోపాల్ వర్మ వ్యూహం లాయర్
అవును మీరు చూస్తున్నది నిజమే. జగన్ కి లాయర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి కూడా లాయర్. అయితే వ్యూహం సినిమాతో మాత్రం జగన్కి సంబంధం లేదు . వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్ జగన్ సర్కారు.. అతిథులు జగన్ మంత్రులు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్కి జగన్ టిటిడి పదవి కూడా ఇచ్చాడు జగన్ అక్రమాస్తుల కేసులు, బాబాయ్ మర్డర్ కేసుతో పాటు మొత్తం జగన్ అండ్…
-

చెల్లి షర్మిలపై జ`గన్` ఎక్కుపెట్టాడు
జగన్ ఎంత నటోరియస్సో చాలా సందర్భాల్లో జనానికి తెలిసొచ్చింది. తన అవినీతి, అధికార, అహంకారానికి ఏమాత్రం భంగం వాటిల్లినా సహించలేడు. ఇది నియంతలలో ఉండే సర్వసాధారణ లక్షణం. అవినాశ్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు, తనకైనా, సొంత చెల్లెలు షర్మిలకైనా ఇవ్వాలన్నాడని సొంత బాబాయ్ అని కూడా చూడకుండా వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా లేపేసిన చరిత్ర అబ్బాయిది. జగన్ చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో ఉంటే, పాదయాత్ర చేసి వైకాపాకి అండగా నిలిచి పార్టీని నిలబెట్టింది…
-

ఐ-ప్యాక్ ప్యాకప్..!! ఇక అంతా డొల్లనే..??
దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకొనే ఏ పార్టీ అయినా సరే ఆయన సాయం కోరే స్థాయికి ఆయన ఎదిగారు. ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) అనే సంస్థను స్థాపించి ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోనే ప్రముఖమైన స్థానంలో నిలిచారు. అయితే, అలాంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఐ ప్యాక్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక తనకు ఐ ప్యాక్ సంస్థకు ఎలాంటి…
-

200 పైగా యూట్యూబ్ చానెల్స్ తో ఎన్నికల సమరంలోకి వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం దూసుకుపోతున్న పార్టీల నేతలు, తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను టిడిపి, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వాటిని తిప్పికొట్టే పనిలో అధికార వైసీపీ పార్టీ నేతలు ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాము అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను, ఆంధ్రప్రదేశ్…
-

పార్లమెంట్ లో తీగ లాగితే ఆంధ్రప్రదేశ్ లో డొంక కదులుతోంది
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన ఘటనకు సరిగ్గా 22 ఏళ్లు నిండిన రోజునే మరోసారి దాడి జరగడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈసారి ఏకంగా లోక్ సభ సమావేశ హాలులోకే ఇద్దరు ప్రవేశించడం కలవరం పుట్టించింది. ఈ ఘటనలో నిందితులు పట్టుబడ్డారు. బీజేపీకే చెందిన ఎంపీ ప్రతాప్ సిన్హా సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టి అక్కడి నుంచి సభలో ప్రవేశించడంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు నిందితులు ఎటువంటి…
-

నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
ఏపీలో రాజకీయ మార్పు నెల్లూరు జిల్లా నుంచే మొదలవబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జగన్ సర్కార్ పై విమర్శలు చేయడానికి విపక్షాలే భయపడుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలగా ఉంటూనే తమ నిరసన గళం వినిపించింది నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పదికి పది సీట్లు ఇచ్చిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి పార్టీ విప్ ను ధిక్కరించి…